టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ఎంచుకున్న భారత ఆటగాళ్లు ప్రభసిమ్రన్ సింగ్, వైభవ్ ఆరంభం నుంచే ఆఫ్ఘన్ బౌలర్లను దండించారు. వైభవ్ 22 బంతుల్లో 9 ఫోర్ల సహాయంతో 44 పరుగులు చేశాడు. అతను అర్ధశతకానికి 6 పరుగుల దూరంలో అవుటయ్యాడు. కానీ, 15 ఏళ్ల బ్యాట్స్మెన్ వైభవ్ బ్యాటింగ్ శైలి అందరి దృష్టిని ఆకర్షించింది.వైభవ్ సూర్యవంశీ ఆడిన తీరు చూస్తే, అతను ఒక వన్డే మ్యాచ్ను టీ20 మ్యాచ్గా మార్చేశాడు. అతను వరుసగా రెండు బౌండరీలతో జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించాడు. అంతకుముందు, శ్రీలంక ‘ఎ’ జట్టుపై వైభవ్ కేవలం 14 పరుగులకే ఔటయ్యాడు, కానీ ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’ జట్టుపై అతను అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని నిరూపించుకున్నాడు.













