తమిళనాడు ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న నటుడు విజయ్ దళపతి. సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పిన ఈ దళపతి.. ఇప్పుడు తమిళనాడు సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే రాజకీయాల్లో జెండా పాతాడంటే మాములు విషయం కాదు. ఆదివారం రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఆత్మీయులు, బంధువులందరినీ వెంటబెట్టుకుని తమిళనాడు కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే.. ఈ కార్యక్రమానికి విజయ్కు మద్దతుగా ఆయన తండ్రి చంద్రశేఖర్, తల్లి శోభ మాత్రమే వచ్చారు. హీరోయిన్ త్రిష గెస్ట్గా వచ్చింది. అయితే ఇంతటి మహోత్తర కార్యక్రమానికి విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం, కొడుకు జేసన్ సంజయ్, కూతురు దివ్య సాషా రాకపోవడంతో ఆ కార్యక్రమం చాలా మందికి వెలితిగా అనిపించింది.













