ప్రపంచ క్రికెట్ దిగ్గజం, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తన భవిష్యత్తు, రిటైర్మెంట్ తర్వాతి జీవితంపై అత్యంత ఆసక్తికరమైన, ముక్కుసూటి వ్యాఖ్యలు చేశారు. ఆటగాడిగా తన ప్రస్థానం ముగిసిన తర్వాత క్రికెట్ రంగానికి పూర్తిగా దూరంగా ఉండాలని తాను భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బెంగళూరులో జరిగిన ‘ఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్’ (RCB Innovation Lab Indian Sports Summit) మూడో ఎడిషన్లో ప్రతినిధులు, క్రీడా విశ్లేషకులు, స్పాన్సర్ల సమక్షంలో కోహ్లీ మాట్లాడారు. కేవలం 20 బంతుల్లో 40 లేదా 50 పరుగులు చేస్తే కోట్లాది రూపాయల డబ్బు, కీర్తి వచ్చే ప్రస్తుత ఐపీఎల్ (IPL) యుగంలో యువ ఆటగాళ్లు ఎలా ముందుకు సాగాలో దిశానిర్దేశం చేస్తూనే, తన కెరీర్లోని క్లిష్ట దశలను ఆయన గుర్తుచేసుకున్నారు.













