Last Updated:
WAPL 2026 Auction: ఆంధ్రప్రదేశ్లోని ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్లను ప్రోత్సహించి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ మహిళల ప్రీమియర్ లీగ్ (WAPL) కీలక దశకు చేరుకుంది.
విజయవాడ వేదికగా నేడు (మంగళవారం) ప్లేయర్స్ వేలం ప్రక్రియ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేలంలో పాల్గొని మహిళా క్రీడాకారిణులను దక్కించుకునేందుకు నాలుగు ఫ్రాంచైజీలు సర్వసన్నద్ధమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి మొత్తం 191 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, వారిలో 80 మందికి లీగ్లో ఆడే అవకాశం దక్కనుంది. ఈ వేలం మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. ఈ వేలాన్ని యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. @aplyoutube చానెల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.














