కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన డీఎస్సీ ప్రక్రియలో అన్యాయం జరిగిందంటున్న అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారీ హామీ ఇచ్చారు. తాడేపల్లిలో డీఎస్సీ అభ్యర్థుల ఆవేదనపై స్పందించిన ఆయన.. బాధితుల న్యాయపోరాటానికి తమ పార్టీ పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ లీగల్ సెల్ ద్వారా అభ్యర్థులకు ఉచితంగా న్యాయసహాయం అందిస్తామని, కోర్టు ఖర్చులన్నీ వైఎస్సార్సీపీనే భరిస్తుందని ప్రకటించారు. ఈ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేసిన జగన్.. భవిష్యత్తులో తమ ప్రభుత్వం వచ్చాక దీనిపై కమిషన్ వేసి రీ-ఎంక్వైరీ జరిపిస్తామని హామీ ఇచ్చారు.
Source link
YS Jagan | డీఎస్సీ అభ్యర్థులకు తోడుగా నేనుంటా | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










