Last Updated:
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు జర్మనీ, సింగపూర్ల నుండి ఎన్ఆర్ఐ కళాబృందాలు రానున్నాయి. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుండి కళాబృందాలు పాల్గొంటాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈసారి ఓ సరికొత్త ఆకర్షణ భక్తులను అలరించనుంది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను గతేడాదితో పోలిస్తే మరింత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా తొలిసారిగా విదేశాల నుంచి ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ కళాబృందాలను ఆహ్వానిస్తోంది. జర్మనీ, సింగపూర్ నుంచి వచ్చే కళాకారులు బ్రహ్మోత్సవాల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు.













