Last Updated:
PM Modi on ISRO: ఈ అద్భుతమైన కలయిక వల్ల మొత్తం అంతరిక్ష పర్యావరణ వ్యవస్థలో (space ecosystem) భారతదేశ సామర్థ్యాలు నలుదిశలా విస్తరిస్తున్నాయని ప్రధాని మోదీ ప్రశంసించారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రతిష్టాత్మకమైన GSLV-F17 రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అధునాతన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-05) ప్రయోగం.. నూటికి నూరు శాతం విజయవంతమైంది. ఈ చారిత్రాత్మక విజయం పట్ల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను, ఈ ప్రయోగంలో పరోక్షంగా, ప్రత్యక్షంగా పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. దేశం గర్వించదగ్గ రోజుగా దీనిని ఆయన అభివర్ణించారు.














