అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరో 40 మంది దాకా ఇరాన్ కీలక పాలకులు, అధికారులూ, సైనికాధికారులూ మరణించారు. పెద్ద తలకాయలను లేపేస్తే.. యుద్ధంలో తాము గెలవగలం అని అమెరికా అనుకుంది. అందువల్ల మొజ్తబా ఖమేనీని కూడా లేపేయడానికి గట్టిగా ప్రయత్నించి, దాడి చేసింది. ఇప్పటికీ అమెరికా టార్గెట్లో మొజ్తబా ఉన్నారనే టాక్ ఉంది. ఒకవేళ అంత్యక్రియలకు మొజ్తబా వస్తే, కచ్చితంగా ఆయన్ని అమెరికా దాడి చేసి చంపేస్తుందనే భయాలు ఇరాన్లో ఉన్నాయి. అందుకే ఆయన్ని తెరపైకి తేవట్లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. (Image – Reuters)













