దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో మల్కాజ్గిరి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో స్మార్ట్, ఇంటరాక్టివ్, బహుభాషా సహాయక వ్యవస్థల ద్వారా పనిచేసే తదుపరి తరం ఏఐ-ఆధారిత ప్రయాణీకుల సమాచార వ్యవస్థలైన భోలు మినీ, భోలు మ్యాక్స్లను ప్రవేశపెట్టింది. ఈ అధునాతన ఇంటరాక్టివ్ విచారణ వ్యవస్థను సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ, వివిధ శాఖల ప్రధాన అధిపతులు, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో లైవ్ డెమో ఇవ్వడం జరిగింది. భోలు ఏఐ అసిస్టెంట్లను సాఫ్ట్వేర్ కోడింగ్తో సహా హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ డాక్టర్ అనిరుధ్ పామర్ తన స్వీయ మేధస్సుతో అంతర్గతంగా రూపొందించి అభివృద్ధి చేశారు. (image: South Central Railway)













