నగర ప్రయాణికుల ఆలోచనలో పెద్ద మార్పు కనిపిస్తోంది. హోటల్ బుకింగ్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ అన్నీ విడిగా ప్లాన్ చేయడం కంటే ఒకే కారవాన్లో అన్నీ ఉండటం వారికి సులభంగా అనిపిస్తోంది. దీనివల్ల ప్రయాణం అంటే కేవలం వెళ్లడం కాదు, “ప్రయాణంలో జీవించడం” అనే భావన పెరుగుతోంది. సచిన్ పంచాల్ చెప్పినట్టు ఎక్కువగా కుటుంబాలు, వృద్ధులు, పెట్ యజమానులు ఈ సేవను ఉపయోగిస్తున్నారు. ఇది బడ్జెట్ ట్రావెల్ కాదు. సౌకర్యం, కంఫర్ట్, కంట్రోల్ ఎక్కువగా కోరుకునే వినియోగదారుల ట్రెండ్. హైదరాబాద్ నుండి తిరుపతి, గోవా, రామేశ్వరం వంటి మార్గాలు ఎక్కువగా బుక్ అవుతున్నాయి. పండుగల సమయంలో ఈ బుకింగ్స్ చాలా రెట్లు పెరుగుతున్నాయి. (image: Motohom)













