CM Revanth Reddy : అక్రమ మైనింగ్పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..కంపెనీలపై సిబిసిఐడి పంజా | ACTPnews

CM Revanth Reddy : అక్రమ మైనింగ్పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..కంపెనీలపై సిబిసిఐడి పంజా



తెలంగాణ శాసనసభలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి మైనింగ్ అక్రమాలపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, పలువురు బీఆర్ఎస్ నేతల కంపెనీలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. మాజీ మంత్రి హరీష్ రావు సోదరుడు సంతోష్ రావు, తండ్రి రవీందర్ రావు నేతృత్వంలో సిరిసిల్ల, నేరెళ్ల ప్రాంతాల్లో ఇసుక మాఫియా సాగిందని ఆరోపించారు. వీటితో పాటు గంగుల కమలాకర్ గ్రానైట్ మైనింగ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కంపెనీల అక్రమాలపై కూడా విచారణ జరిపిస్తామన్నారు. హరీష్ రావు ఆరోపించిన రాఘవ కన్స్ట్రక్షన్స్తో సహా అన్నింటిపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు బయటపెడతామని సీఎం సవాల్ విసిరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *