Iron-US Hight Tension: ఇరాన్‌పై ఈ రాత్రే దాడి చేస్తాం.. ట్రంప్ హెచ్చరిక.. ‘నువ్వు ఏం చేయలేవు’ ఆ దేశం ఎటాక్ | | ACTPnews

News18


Last Updated:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై త్వరలోనే సైనిక దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించగా, హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. సీజ్‌ఫైర్ ముగిసిందని ప్రకటించిన ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ అడ్మిరల్ హబీబుల్లా సయ్యారి ఘాటుగా స్పందించారు. తాజా అమెరికా-ఇరాన్ పరిణామాల పూర్తి వివరాలు తెలుసుకోండి.

News18
News18

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా ఈ రాత్రే సైనిక దాడి చేసే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. కొన్ని గంటల ముందే టెహ్రాన్‌తో ఉన్న కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ముగిసిందని ప్రకటించిన ట్రంప్, తాజా పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

నాటో సదస్సులో మాట్లాడుతూ, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ జరిపిన దాడులు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని ట్రంప్ ఆరోపించారు. “ఇరాన్ చేస్తున్న చర్యలపై నేను సంతోషంగా లేను. ఇది ప్రభుత్వ మార్పు (Regime Change) గురించి కాదు. కానీ ఇరాన్ అణ్వాయుధాలను పొందడం మాకు అస్సలు ఇష్టం లేదు. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ జరిపిన దాడులు తాత్కాలిక ఒప్పందానికి విరుద్ధం. మా ఒప్పందం ప్రకారం ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలి. లేకపోతే మేమే దాన్ని నిలిపివేస్తాం” అని ట్రంప్ హెచ్చరించారు.

ఇంతకుముందు రోజే ట్రంప్, అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన అవగాహన ఒప్పందం (MoU) నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే, భవిష్యత్తులో చర్చలకు అవకాశం మాత్రం పూర్తిగా మూసివేయలేదని కూడా చెప్పారు. ఇదే సమయంలో హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు జరపడంతో మళ్లీ యుద్ధ పరిస్థితులు తలెత్తే అవకాశాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి.

హోర్ముజ్ జలసంధి మళ్లీ ఉద్రిక్తతలకు కేంద్రం

ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ప్రస్తుతం మరోసారి ఘర్షణలకు కేంద్రబిందువుగా మారింది. ఫిబ్రవరి చివరిలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

హోర్ముజ్ జలసంధిపై తమకే నియంత్రణ ఉండాలని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి రుసుము వసూలు చేస్తామని, తమ అనుమతించిన మార్గం నుంచి తప్పుకుంటే ఆ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరిస్తోంది. గత కొన్ని రోజుల్లో ఇరాన్ సైన్యం కనీసం మూడు నౌకలపై దాడులు చేసినట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందనగా మంగళవారం అమెరికా ఇరాన్ లక్ష్యాలపై విస్తృత స్థాయిలో దాడులు జరపగా, అనంతరం ఇరాన్ గల్ఫ్ ప్రాంత దేశాలపై ఎదురుదాడులు చేపట్టినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ట్రంప్‌పై ఇరాన్ అడ్మిరల్ సెటైర్లు

ఇదిలా ఉండగా, ఇరాన్ నౌకాదళానికి చెందిన అడ్మిరల్ హబీబుల్లా సయ్యారి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. ఇరాన్ సైనిక శక్తిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన, “ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని, ఇరాన్ తీరాల్లో ఆధిపత్యం చెలాయిస్తామని, హోర్ముజ్ జలసంధిలో అత్యాధునిక యుద్ధనౌకలను మోహరిస్తామని ట్రంప్ గతంలో ఎన్నో గొప్పలు చెప్పారు. కానీ ఆ ప్రణాళికలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు” అని విమర్శించారు.

అంతేకాకుండా, “ఇరాన్‌ను వెనిజులా లేదా అమెరికా ఇష్టానుసారం చర్యలు తీసుకునే ఇతర బలహీన దేశాలతో పోల్చడం పెద్ద అపోహ. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునే సామర్థ్యం కలిగిన దేశం” అంటూ ట్రంప్‌కు సయ్యారి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed