హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని, అందుకే ప్రజలు బంగారం కొనడం ఆపేయాలని, ఇంధనం ఆదా చేయాలని ప్రధాని కోరడంపై ఒవైసీ తీవ్రంగా స్పందించారు. “దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని ఒకవైపు చెబుతూ.. మరోవైపు ప్రజలను బంగారం కొనొద్దని కోరడం ఏంటి?” అని ప్రశ్నించారు. మోదీకి దమ్ముంటే దేశ ఆర్థిక పరిస్థితిపై నిజాలు చెప్పాలని సవాల్ విసిరారు. ఇజ్రాయెల్ పర్యటన ద్వారా మోదీ తప్పుడు సంకేతాలు పంపారని, ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకుంటుంటే ప్రజలపై భారం వేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Source link
Owaisi Challenges PM Modi | దమ్ముంటే సమాధానం చెప్పు! మోదీపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports













