PM Modi: లఖీసరాయ్ అశోక్ ధామ్ ఆలయం తొక్కిసలాటలో ఏడుగురు మృతి.. ప్రధాని మోదీ సంతాపం | | ACTPnews

లఖీసరాయ్ అశోక్ ధామ్ ఆలయం తొక్కిసలాటలో ఏడుగురు మృతి.. ప్రధాని మోదీ సంతాపం


Last Updated:

PM Modi: లఖీసరాయ్ అశోక్ ధామ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా కలచివేసింది. శ్రావణ సోమవారం నాడు ఈ ఘటన జరగడం అందర్నీ విషాదంలో ముంచేసింది. ప్రధాని మోదీ కూడా దీనిపై ఆవేదన వ్యక్తం చేశారు.

లఖీసరాయ్ అశోక్ ధామ్ ఆలయం తొక్కిసలాటలో ఏడుగురు మృతి.. ప్రధాని మోదీ సంతాపం
లఖీసరాయ్ అశోక్ ధామ్ ఆలయం తొక్కిసలాటలో ఏడుగురు మృతి.. ప్రధాని మోదీ సంతాపం

బీహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలోని అశోక్ ధామ్ ఆలయం సమీపంలో సోమవారం (ఆగస్టు 17) ఉదయం జరిగిన తొక్కిసలాట ఘటనలో కనీసం ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 14 నుంచి 19 మంది వరకు గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, “లఖీసరాయ్, బీహార్‌లో తొక్కిసలాట వల్ల ప్రాణాలు కోల్పోయినందుకు నేను వేదన చెందుతున్నాను. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. స్థానిక పరిపాలనా యంత్రాంగం.. బాధితులకు సహాయం అందిస్తోంది” అని తెలిపారు. ఈ ప్రకటనను ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా నిర్ధారించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *