Project Elephant Under Modi: ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్.. ఏనుగుల రక్షణకు కేంద్రం కీలక చర్యలు | | ACTPnews

ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్.. ఏనుగుల రక్షణకు కేంద్రం కీలక చర్యలు


Last Updated:

Project Elephant Under Modi: కేంద్ర ప్రభుత్వం.. ప్రాజెక్ట్ ఎలిఫాంట్ అనే కార్యక్రమం చేపట్టిందని చాలా మందికి తెలియదు. ఎందుకంటే.. పెద్దగా ప్రచారం లేదు. కానీ ఈ కార్యక్రమం ద్వారా ఏనుగుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. దీనిపై తాజా వివరాల్ని ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్ నెటిజన్లకు వివరించారు. అవి తెలుసుకుందాం.

ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్.. ఏనుగుల రక్షణకు కేంద్రం కీలక చర్యలు
ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్.. ఏనుగుల రక్షణకు కేంద్రం కీలక చర్యలు

ప్రపంచ ఏనుగు దినోత్సవం (ఆగస్టు 12) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. “ఏనుగు కేవలం అడవి జంతువు మాత్రమే కాదు.. అది అడవుల సంరక్షకుడు, పర్యావరణ సమతుల్యతకు చిహ్నం, భారతీయ సహజ వారసత్వంలో అంతర్భాగం” అని ఆయన తెలిపారు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ద్వారా భారతదేశం చేస్తున్న దీర్ఘకాలిక కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బలోపేతం చేశారని ఆయన అభినందించారు. ఏనుగుల రక్షణ, వాటి ఆవాసాలు, కారిడార్ల భద్రత, మానవ-వన్యప్రాణుల సహజీవనం ప్రోత్సాహం దేశీయ సంకల్పం అని స్పష్టం చేశారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రి భూపేందర్ యాదవ్ మార్గదర్శకత్వాన్ని కూడా ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో కుంకీ ఏనుగులు, హనుమాన్ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన బృందాలు, రెస్క్యూ మౌలిక సదుపాయాలు, సాంకేతికత, వేగవంతమైన ప్రతిస్పందనతో వన్యప్రాణి రక్షణను మరింత సమర్థవంతం, మానవీయం చేస్తున్నామని తెలిపారు. “సురక్షిత సమాజాలు, రక్షిత అడవులు, సురక్షిత ఆవాసాల్లో ఏనుగులు స్వేచ్ఛగా తిరిగేలా చేస్తున్నాం” అని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports