Last Updated:
Team India: శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టుకు కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. చేతిదాకా వచ్చిన విజయాన్ని టీమిండియా అందుకోలేకపోయింది.
శ్రీలంక యువ బ్యాటర్ సోనాల్ దినూష అద్భుత సెంచరీతో (133 పరుగులు) పాటు పసిందు సూరియబండార, కమిందు మెండిస్, కేశర నువంత అందించిన విలువైన సహకారంతో లంక జట్టు నాలుగు, ఐదో రోజుల్లో భారత బౌలర్లను సమర్థవంతంగా నిలువరించింది. ఫలితంగా కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) మైదానంలో గురువారం ముగిసిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.














