Last Updated:
తాజాగా ‘రణబాలి’ సినిమా షూటింగ్ సెట్స్లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న.. పలు పర్సనల్ విషయాలపై ఓపెన్ అయ్యారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా రేంజ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల ఒక తీవ్రమైన ప్రమాదానికి గురై కోలుకున్నారు. సినిమా పట్ల ఆమెకున్న అంకితభావం, నొప్పితో పోరాడిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. దాదాపు నెలన్నర రోజుల పాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకున్న ఈ కన్నడ కస్తూరి, ఇప్పుడు పూర్తిగా కోలుకుని మళ్లీ తన షూటింగ్ పనుల్లో బిజీ అయిపోయారు. హైదరాబాద్లో జరుగుతున్న ‘రణబాలి’ సినిమా షూటింగ్ సెట్స్లో ఆమె ఎంతో ఉత్సాహంగా అడుగుపెట్టారు.














