ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే పి.సి.ఓ.ఎమ్ కె. పద్మజ, దక్షిణ మధ్య రైల్వే పిసిసిఎం, ఇటి పాండే, సికింద్రాబాద్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్. గోపాలకృష్ణన్, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సీనియర్ రైల్వే అధికారులు, కాన్కోర్ & మెర్స్క్ నుండి అధికారులు, లాజిస్టిక్స్ భాగస్వాములు, కీలక వాటాదారులు కూడా పాల్గొన్నారు. “ఔషధి ఎక్స్ప్రెస్” అనే బ్రాండ్తో ఉన్న ఈ రిఫ్రిజిరేటెడ్ (రీఫర్) కంటైనర్ను, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ (జె.ఎన్.పి.టి)కు కాన్కోర్ సంస్థ నడుపుతోంది. ఈ సేవ ప్రత్యేకంగా ప్రాణరక్షక ఔషధాలు, ఇతర ఉష్ణోగ్రతకు సున్నితమైన సరుకులను సురక్షితంగా రవాణా చేయడానికి రూపొందించబడింది. అధునాతన రీఫర్ కంటైనర్లలో డీజిల్ పవర్ ప్యాక్లు అమర్చబడి ఉండటం వలన, ప్రయాణమంతా నిరంతర శీతలీకరణ కొనసాగుతుంది. (image: South Central Railway)













