సెక్షన్ 163 ప్రకారం సరుకుల గురించి తప్పుడు సమాచారం ఇస్తే, ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం జరిమానా విధిస్తారు. సెక్షన్ 165 ప్రకారం ప్రమాదకరమైన లేదా అభ్యంతరకరమైన వస్తువులు తీసుకెళితే కనీసం రూ.10,000 జరిమానా ఉంటుంది. సెక్షన్ 166 ప్రకారం రైల్వే నోటీసులు లేదా బోర్డులను పాడు చేస్తే మొదటి నేరానికి రూ.2,000 జరిమానా విధిస్తారు. సెక్షన్ 167 ప్రకారం రైలులో పొగ తాగితే రూ.2,000 జరిమానా ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే, సురక్షితమైన, భద్రమైన, సౌకర్యవంతమైన ప్రయాణాలు అందరి ఉమ్మడి బాధ్యత కాబట్టి, ప్రయాణికులు సరైన, చెల్లుబాటు అయ్యే టిక్కెట్లతో ప్రయాణించాలని, టికెట్ తనిఖీ సిబ్బందికి సహకరించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)













